News September 21, 2025
కృష్ణా: ఆ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు..!

జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 3 వ్యక్తులు ఎమ్మెల్యేలుగా పాలన నడుస్తోంది. JSP MLA, ఆయన కుమారుడు, అల్లుడు వేర్వేరుగా వ్యవహారాలు చూసుకుంటున్నారు. అల్లుడు వ్యాపారం, కొడకు కేడర్, MLA అధికారులను డీల్ చేస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవులు మాత్రం టీడీపీ నేతలకే దక్కుతున్నాయని జనసేన శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు వాపోతున్నట్లు సమాచారం.
Similar News
News September 21, 2025
లా విద్యార్థులకు విజయవాడలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం

APCRDA కార్యాలయం నుంచి ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్న్షిప్ చేసేందుకు 2025లో లా కోర్సు పూర్తి చేసినవారు, ఫైనలియర్ LLB చదివేవారు ఈ నెల 23లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు చేసినవారిలో ఇద్దరిని ఎంపిక చేస్తామని, వివరాలకు https://crda.ap.gov.in/ వెబ్సైట్లోని కెరీర్స్ ట్యాబ్ చూడాలని సూచించారు.
News September 21, 2025
2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్నాథ్

ప్రధాని పదవికి బీజేపీలో ఎలాంటి పోటీ లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. 2029తో పాటు 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనేనని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమవ్వడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, సంక్షోభంలోనూ నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మోదీకే చెల్లిందని కొనియాడారు. పహల్గాం ఘటనకు స్పందించిన తీరే దీనికి నిదర్శనమని రాజ్నాథ్ అన్నారు.
News September 21, 2025
మెదక్: ‘జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు’

జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.