News September 21, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో వైభవంగా రుద్రహోమం
✓ భద్రాద్రి: తల్లీ, కుమారుడు అదృశ్యం
✓ మణుగూరు: ఈవోతో భక్తుల వాగ్వాదం..!
✓ అశ్వారావుపేట సొసైటీ సీఈవో సస్పెన్షన్
✓ అశ్వారావుపేట పోలీసులపై దాడికి యత్నం.. వ్యక్తిపై కేసు
✓ సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వాలని సీఎంకు కొత్తగూడెం ఎమ్మెల్యే వినతి
✓ మణుగూరు: డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన
✓ కొత్తగూడెం: గంజాయి విక్రయదారుల అరెస్ట్

Similar News

News September 21, 2025

లా విద్యార్థులకు విజయవాడలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం

image

APCRDA కార్యాలయం నుంచి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్న్‌షిప్ చేసేందుకు 2025లో లా కోర్సు పూర్తి చేసినవారు, ఫైనలియర్ LLB చదివేవారు ఈ నెల 23లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు చేసినవారిలో ఇద్దరిని ఎంపిక చేస్తామని, వివరాలకు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లోని కెరీర్స్ ట్యాబ్ చూడాలని సూచించారు.

News September 21, 2025

2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్‌నాథ్

image

ప్రధాని పదవికి బీజేపీలో ఎలాంటి పోటీ లేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2029తో పాటు 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనేనని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమవ్వడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, సంక్షోభంలోనూ నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మోదీకే చెల్లిందని కొనియాడారు. పహల్గాం ఘటనకు స్పందించిన తీరే దీనికి నిదర్శనమని రాజ్‌నాథ్ అన్నారు.

News September 21, 2025

మెదక్: ‘జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు’

image

జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.