News September 21, 2025
కూటమి పార్టీలు మరో 15 ఏళ్లు కలిసే ఉంటాయి: మంత్రి మనోహర్

AP: కూటమి పార్టీలు మరో 15 ఏళ్లు కలిసే ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమానికే CM చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసమే Dy.CM పవన్ కళ్యాణ్ నిలబడ్డారని వివరించారు. ఇటీవల అసెంబ్లీలో బోండా ఉమ, పవన్ <<17776165>>ఎపిసోడ్<<>> తర్వాత ఇరుపార్టీల బంధంపై పలు ప్రశ్నలు ఉత్పన్నం కాగా, పైవ్యాఖ్యలతో వాటికి మనోహర్ క్లారిటీ ఇచ్చినట్లైంది.
Similar News
News September 21, 2025
అమెరికా ఒక్కటే లేదు బ్రదర్..!

కొత్తగా H1B వీసాపై అమెరికా వెళ్లేవారికి లక్ష డాలర్ల ఫీజు పెంపు వర్తించనుంది. అయితే పూర్తిగా అమెరికాపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కొరత ఉందని, ఆ దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలని, Aiపై ఎక్కువ ఫోకస్ చేయాలని అంటున్నారు.
News September 21, 2025
ఎంగిలి పూల బతుకమ్మ.. ఏ నైవేద్యం పెట్టాలంటే?

బతుకమ్మ పండుగ మొదటి రోజును ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని గౌరీ దేవికి సమర్పిస్తారు. ఇది పితృపక్షం మహాలయ అమావాస్య రోజున వస్తుంది. కాబట్టి పూర్వీకులకు తర్పణాలు వదిలి, ఆ తర్వాత ఈ పూజ చేస్తారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయ్యాక, ఈ ప్రసాదాన్ని అందరూ పంచుకుంటారు.
News September 21, 2025
నేడు పాక్తో టీమ్ఇండియా సూపర్-4 పోరు

ఆసియాకప్ 2025లో టీమ్ ఇండియా, పాకిస్థాన్ రెండో సారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో అజేయంగా సాగిన సూర్య సేన అదే జోరును సూపర్-4లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది. భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉండగా బ్యాటింగ్లో సూర్య, సంజూ, అభిషేక్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. అటు పాక్ను తక్కువ అంచనా వేయలేం. దుబాయ్ వేదికగా మ్యాచ్ నేడు రా.8 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్లో లైవ్ చూడవచ్చు.