News September 21, 2025

2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్‌నాథ్

image

ప్రధాని పదవికి బీజేపీలో ఎలాంటి పోటీ లేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2029తో పాటు 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనేనని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమవ్వడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, సంక్షోభంలోనూ నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మోదీకే చెల్లిందని కొనియాడారు. పహల్గాం ఘటనకు స్పందించిన తీరే దీనికి నిదర్శనమని రాజ్‌నాథ్ అన్నారు.

Similar News

News September 21, 2025

24 గంటలు గడవక ముందే మాట మార్చేశారు.. ఎందుకిలా?

image

H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే సమయంలో కామర్స్ సెక్రటరీ <<17768634>>హోవర్డ్<<>> ప్రతి ఏడాది లక్ష డాలర్లు చెల్లించాలని చెప్పారు. కానీ 24 గంటలు తిరగకముందే వైట్‌హౌస్ మరో ప్రకటన చేసింది. కేవలం కొత్త వీసాల కోసం అప్లై చేసే వారికే ఆ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. దీంతో ఏం జరిగింది? ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? అనే సందేహాలు వస్తున్నాయి.

News September 21, 2025

రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

image

AP: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. రేపు ఉ.9 గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 1న ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొంటారు. అక్టోబర్ 2 దసరా రోజున తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

News September 21, 2025

BCCI కొత్త అధ్యక్షుడు ఇతడేనా?

image

జమ్మూకశ్మీర్‌కు చెందిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ముందున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. రోజర్ బిన్నీ తర్వాత ఇతడికే పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇవాళ ఢిల్లీలో జరిగే వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. ఢిల్లీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మిథున్ 9వేలకు పైగా రన్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. IPL(2008-14)లో ఆడిన తొలి J&K ప్లేయర్‌గా నిలిచారు.