News September 21, 2025

అమ్మవారిని మేల్కొలిపిన పూల పండుగే ‘బతుకమ్మ’

image

దుర్గాదేవి మహిషాసుర సంహారం తర్వాత అలసి నిద్రలోకి జారుకోగా, భక్తులు ఆమెను మేల్కొల్పడానికి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారని పండితులు చెబుతున్నారు. గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పూలను భక్తులు ఒకచోట పేర్చి ఆమె కోసం ఆరాధనలు, సంకీర్తనలు చేసి, వేడుకున్నారని ప్రతీతి. ఈ భక్తి, అంకితభావానికి మెచ్చి అమ్మవారు మేల్కొన్నారని, అలా బతుకమ్మ పండుగ ఉద్భవించిందని నమ్ముతారు.

Similar News

News September 21, 2025

మోదీని కలిశా కానీ మాట్లాడలేదు: ప్రకాశ్ రాజ్

image

ప్రధాని మోదీపై నిప్పులు చెరిగే సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను ఎయిర్‌పోర్టులో ఆయన్ను కలిశాను. కానీ మాట్లాడలేదు’ అని మోదీ కటౌట్ ఎదురుగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ‘మోదీని కలిసేంత కెపాసిటీ మీకు లేదు. ఇదే ఎక్కువ’ అని కొందరు ప్రకాశ్ రాజ్‌పై సెటైర్లు వేస్తున్నారు. ‘మోదీ టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. మీతో అసలే మాట్లాడరు’ అని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.

News September 21, 2025

చిట్టి తల్లీ సీటు ఇప్పిస్తా.. నిశ్చింతగా చదువుకో: మంత్రి లోకేశ్

image

AP: KGBVలో సీటు రాకపోవడంతో కర్నూల్(D) బూదూరుకు చెందిన జెస్సీ అనే బాలిక పత్తి పొలంలో పనికి వెళ్తోందన్న మీడియా కథనంపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ KGBVలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో. పరిస్థితులేవైనా పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. విద్యకు పిల్లల్ని దూరం చేయొద్దని తల్లిదండ్రుల్ని వేడుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

News September 21, 2025

సా.5 గంటలకు మోదీ ప్రసంగం

image

ఈ సాయంత్రం 5 గం.కు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో దానిపై ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా అమెరికా H1B వీసాలపై మాట్లాడతారా? అనేది చూడాలి.