News September 21, 2025
వరిలో ఎలుకల నివారణకు ఇలా చేయండి

* బ్రోమోడయోలిన్ మందు 10-15 గ్రా.(పిడికెడు నూకలు, కాస్త నూనెతో కలుపుకుని) పొట్లాలుగా కట్టి కన్నానికి ఒకటి చొప్పున పెట్టాలి.
* ఈ మందును 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్టుకోవాలి.
* కన్నాల దగ్గర పొగబారించుకోవడం ద్వారా ఎలుకలను తరిమివేయవచ్చు.
* ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలు పెట్టుకోవాలి.
* ఎలుకలను నిర్మూలించడానికి రైతులు సామూహికంగా చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది.
<<-se>>#PADDY<<>>
Similar News
News September 21, 2025
చిట్టి తల్లీ సీటు ఇప్పిస్తా.. నిశ్చింతగా చదువుకో: మంత్రి లోకేశ్

AP: KGBVలో సీటు రాకపోవడంతో కర్నూల్(D) బూదూరుకు చెందిన జెస్సీ అనే బాలిక పత్తి పొలంలో పనికి వెళ్తోందన్న మీడియా కథనంపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ KGBVలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో. పరిస్థితులేవైనా పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. విద్యకు పిల్లల్ని దూరం చేయొద్దని తల్లిదండ్రుల్ని వేడుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
News September 21, 2025
సా.5 గంటలకు మోదీ ప్రసంగం

ఈ సాయంత్రం 5 గం.కు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో దానిపై ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా అమెరికా H1B వీసాలపై మాట్లాడతారా? అనేది చూడాలి.
News September 21, 2025
పాడి పశువుల్లో కురమ జ్వరంతో నష్టాలు

పశువులకు అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వర్షాకాలంలో బలిష్టమైన ఆంబోతులు, ఎద్దులు, ఆవులకు కురమ జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి పశువులో 3 రోజులు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ.. ఈ సమయంలో పశువులు బాగా నీరసించిపోతాయి. పాల దిగుబడి దాదాపు 80% వరకు తగ్గిపోతుంది. కురమ జ్వరం లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెటర్నరీ నిపుణులు రాంబాబు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.