News September 21, 2025
స్థానిక ఎన్నికలు.. ఏం చేద్దాం?

స్థానిక ఎన్నికలపై నిన్న మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ 2, 3 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. బీసీల రిజర్వేషన్ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటంతో స్పెషల్ జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్దామని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. చట్టం వచ్చాకే ఎన్నికలు నిర్వహిద్దామని మరికొందరు అన్నారట. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేద్దామని పలువురు సూచించినట్లు సమాచారం.
Similar News
News September 21, 2025
H1B ఫీజు రూల్స్.. పూర్తి వివరాలు

*కొత్తగా H1B కోసం అప్లై చేసుకునే వారికే వర్తిస్తుంది. (అంటే 2026 నుంచి వీసా పిటిషన్ ఫైల్ చేసే వారికి)
*కొత్త వీసా కోసం కంపెనీలు లక్ష డాలర్లు ఒకేసారి చెల్లించాలి. ప్రతి ఏడాది కట్టాల్సిన అవసరం లేదు
*ప్రస్తుతం H1B వీసా ఉన్నవారికి ఇది వర్తించదు
*వీసా రెన్యూవల్స్, 2025 లాటరీ విన్నర్లకూ మినహాయింపు
*ప్రస్తుతం వీసా ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లవచ్చు. తిరిగి అమెరికాకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
News September 21, 2025
లైంగిక వేధింపులపై యువతి ఫిర్యాదు.. KA పాల్పై కేసు నమోదు

TG: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్పై కేసు నమోదైంది. తనను పాల్ లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు FIR నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన యువతి కేఏ పాల్ వద్ద పని చేసినట్లు తెలుస్తోంది.
News September 21, 2025
ఈసారి దేవీ నవరాత్రులు 10 రోజులు ఎందుకు?

నేటి నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులకు బదులుగా 10 రోజులు జరగనున్నాయి. సెప్టెంబర్ 24, 25 తేదీలలో తృతీయ తిథి రెండు రోజులు ఉండటం వల్ల నవరాత్రి వేడుకల్లో ఒక రోజు పెరిగింది. భక్తులు ఈ 10 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించవచ్చని, తద్వారా శక్తి, అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజుల్లో ఉపవాసం పాటిస్తూ.. దుర్గాదేవిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని సూచిస్తున్నారు.