News September 21, 2025
అనకాపల్లి జిల్లాలో 291 కేసులు పరిష్కారం

అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 291 కేసులు పరిష్కరించినట్లు పీజీఆర్ఎస్ నోడల్ అధికారిణి సుబ్బలక్ష్మి తెలిపారు. అనకాపల్లి ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. శనివారం జిల్లాలో 68 కేసులను విచారించి 7 కేసులు పరిష్కరించామన్నారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఈ సమావేశాలు జరిగాయన్నారు.
Similar News
News September 21, 2025
పాతబస్తీ పనుల్లో వేగం పెంచండి: మెట్రో MD

HYD మెట్రో రైల్ ప్రాజెక్టుపై HMRL ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మెట్రో మొదటి దశ, ముఖ్యంగా పాత నగరంలో పనులను వేగవంతం చేయాలని, సవాళ్లను అధిగమించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టునూ సమీక్షిస్తూ, సీఎం మార్గదర్శనంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
News September 21, 2025
ఆరోగ్యశ్రీతో NIMSలో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

NIMSలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు 4వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ శిబిరం విజయవంతంగా పూర్తైంది. డా.రమణ, డా.ఎం.అమరేశ్ రావు ఆధ్వర్యంలో 22 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేశారు. ఇందులో రష్యా, యూకే, భారత్కు చెందిన వైద్య నిపుణులు కలిసి సేవలందించారు. 500 మందికిపైగా రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందించారు.
News September 21, 2025
KNR: నేటితో ‘పెత్తరమాస’ తర్పణాలు లాస్ట్..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెత్తరమాస (పెద్దల అమావాస్య) ఈనెల 7న ప్రారంభమైంది. ఈ సందర్భంగా పక్షం రోజులు తండ్రి, తాత, ముత్తాతలు, ఇతరులను తలుచుకొని ఆరాధిస్తారు. వారి సంతానం నైవేద్యాలను సమర్పిస్తుంది. ఇలా చేస్తే తర్వాతి తరాలవారిపై పూర్వీకుల దీవెనలు ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. కాగా, నేటితో ఈ తర్పణాల కార్యక్రమాలు ముగియనుండగా సాయంత్రం నుంచి బతుకమ్మ వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభం కానున్నాయి.