News September 21, 2025
కొత్తగూడెం: సింగరేణి అధికారుల బదిలీ

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి మైనింగ్ విభాగంలో పనిచేస్తున్న 31 మంది అధికారులను బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్ అధికారులు ఆర్డర్స్ ఇచ్చారు. బదిలీ అయిన వారిలో ఏజీఎం మొదలుకొని మేనేజర్ స్థాయి వరకు అధికారులు ఉన్నారు. కాగా ఈనెల 27వ తేదీలోగా కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
JGTL: బయాలజీ ఉపాధ్యాయుడికి OU డాక్టరేట్

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం ZPHSలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లేశ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈయన ‘మార్పో అనాటమికల్ & ఫైటో కెమికల్ స్టడీస్ ఆన్ లెస్సెర్ నోన్ ఇతనో మెడిసినల్ ప్లాంట్స్ ఫ్రమ్ రామగిరి ఖిల్లా ఆఫ్ PDPL డిస్ట్రిక్ట్’ మీద అధ్యయనం చేశారు. ఇందుకు మల్లేశ్కు PhD పట్టా లభించింది. పాఠశాల HM చంద్రకళ, పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను సన్మానించారు.
News September 21, 2025
జన్జీ ఉద్యమం వస్తుందన్న KTR.. బండి సంజయ్ రిప్లై ఇదే!

TG: నేపాల్ తరహాలో INDలోనూ జన్జీ ఉద్యమం రావొచ్చన్న <<17778245>>KTR కామెంట్స్పై<<>> కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘నేపాల్ జన్జీ నెపోటిజంపై పోరాడారు. తెలంగాణ జన్జీ వారి కంటే ముందే KCR, ఆయన పిల్లల్ని పక్కన పెట్టారు. లోక్సభ ఎన్నికల్లో BRSకు బిగ్ జీరో ఇచ్చారు. ఫ్యామిలీ రూల్ను అంతం చేశారు’ అని ట్వీట్ చేశారు. KTRను నెపో కిడ్గా పేర్కొంటూ NDTV-YUVA కాన్క్లేవ్లో ఆయనకు యువత రియాలిటీని చూపించిందన్నారు.
News September 21, 2025
చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం: బుగ్గన

AP: పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారని ప్రశ్నించారు. పోలవరానికి శంకుస్థాపన చేసి, అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్సారేనని అన్నారు. హంద్రీ-నీవాపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందులో ఎక్కువ పనులు చేసింది రాజశేఖర్ రెడ్డేనని చెప్పారు.