News September 21, 2025

రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

image

AP: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. రేపు ఉ.9 గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 1న ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొంటారు. అక్టోబర్ 2 దసరా రోజున తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

Similar News

News September 21, 2025

మరికొన్ని గంటల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత జట్టు అంచనా!

image

ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్vsపాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడగా మ్యాచ్ ఆడటంపై అనిశ్చితి నెలకొనడంతో అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణా వచ్చే ఛాన్స్ ఉందని NDTV తెలిపింది.
టీమ్ అంచనా: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్

News September 21, 2025

అర్ధరాత్రి నుంచి ధరలు తగ్గే వస్తువులు ఇవే..

image

దేశవ్యాప్తంగా ఈ అర్ధరాత్రి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇక నుంచి 5%, 18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్నింటిని 40% ట్యాక్స్ లిస్టులో చేర్చారు. దాదాపు 200కు పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆహారం, పాల ఉత్పత్తులు, FMCG, ఎలక్ట్రానిక్స్, వాహనాల ధరలు పడిపోనున్నాయి. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయో ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుగులో తెలుసుకోవచ్చు.

News September 21, 2025

అత్తా కోడళ్లకు ఎందుకు పడదంటే?

image

అత్తాకోడళ్లంటే ఒకే ఒరలో రెండు కత్తులని అందరూ భావిస్తారు. దీనికి కారణాలు అనేకం. భర్త తన సొంతం అని కోడలు అనుకుంటుంది. కొడుకును తన దగ్గర్నుంచి లాక్కున్నారని తల్లి అనుకుంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండదు. సమాజం కోడలు ఎలా ఉండాలి అనేది ఒక ఫ్రేమ్ వర్క్‌లో చూస్తుంది. పోటీ తత్త్వం, అసూయ, ప్రాథమిక కారణాలు అని సైకాలజిస్ట్‌లు అంటున్నారు. అత్తా కోడళ్ల మధ్య ఓపెన్‌నెస్ ఉంటే చాలా సమస్యలు సమసిపోతాయని సూచిస్తున్నారు.