News September 21, 2025
దుర్గగుడిలో భక్తులకు క్యూఆర్ కోడ్ సేవలు: కలెక్టర్

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గగుడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, హోల్డింగ్ ప్రాంతాలు, 1.8కి.మీ పొడవున ఉన్న క్యూలైన్లలో ప్రతి 100 మీటర్లకు క్యూఆర్ కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ కోడ్ స్కాన్ చేసి, ఉత్సవాల ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను, సమస్యలను తెలియజేయవచ్చని చెప్పారు.
Similar News
News September 21, 2025
ఈ-గవరన్నెన్స్ సదస్సును విజయవంతం చేయాలి: కలెక్టర్

విశాఖలో సెప్టెంబర్ 22, 23 తేదీలలో జరగనున్న 28వ జాతీయ ఈ-గవరన్నెన్స్ సదస్సును విజయవంతం చేయాలని జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ నిర్దేశించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News September 21, 2025
శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా: TDP

AP: జగన్ హయాంలో పరకామణిలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణం వెనుక ఉన్నది ఎవరు? అని వైసీపీ నేతలను TDP ప్రశ్నించింది. ‘దొంగతనం చేసిన వాడిని శిక్షించకుండా, రాజీ ఎందుకు కుదిర్చారు? దొరికిన దొంగకు చెందిన ఆస్తులు, ఎవరి పేరున రిజిస్టర్ చేయించారు? చిన్న దొంగలు, పెద్ద దొంగలు కలిసి శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా? హైకోర్టు తీర్పుతో జగన్ హయాంలో జరిగిన పాపం పండింది’ అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.
News September 21, 2025
పరకామణి కేసు లోక్ అదాలత్లో రాజీ కాదా…?

రవికుమార్ పరకామణిలో దొంగతనం చేసి 2023 ఏప్రిల్లో పట్టుబడ్డారు. ఆయనపై పోలీసులు సెక్షన్ 379, 381 కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లో 379 దొంగతనం కేసు కాగా, సెక్షన్ 381లో యజమాని ఆస్తిని క్లర్క్, ఇతర ఉద్యోగులు దొంగిలించడం ద్రోహం అని చట్టం చెబుతోంది. ఇదే అంశాన్ని CRPC సెక్షన్ 320 క్లాస్ 2 అనుగుణంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకునే వీలు లేదని చట్టాలు చెప్తున్నాయి. ఈ కేసు విషయం CBCID దర్యాప్తులో తేలనుంది.