News September 21, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News September 23, 2025
ADB: చేప.. చేప నువ్వేక్కడా?

తెలంగాణ మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఆ పథకం అమలుకాక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 283 చెరువులు ఉండగా.. 107 మత్స్యకార సంఘాలు పని చేస్తున్నాయి. వీటితో పాటు సాత్నాల, మత్తడివాగు, దహెగాం ప్రాజెక్టులు ఉన్నాయి. జలవనరుల్లో కోటి వరకు చేప పిల్లలు వదలాలి. సెప్టెంబర్ నెల గడిచిపోతున్నా చేప పిల్లు ఇంకా వదలలేదు.
News September 22, 2025
ADB: అగ్రి కళాశాల అసోసియేట్ డీన్గా డా.వై.ప్రవీణ్ కుమార్

వ్యవసాయ కళాశాల నూతన అసోసియేట్ డీన్గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు డీన్గా ఉన్న డాక్టర్ శ్రీధర్ చౌహాన్ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీపై వెళ్లారు. గతంలో ప్రవీణ్ కుమార్ కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్లో కోఆర్డినేటర్గా విధులు నిర్వహించారు. నూతనంగా విధులు స్వీకరించడం పట్ల కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.
News September 22, 2025
ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలి: ADB SP

ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎస్పీ అఖిల్ మహాజన్ ను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. మొత్తం 43 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.