News September 21, 2025
రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షం

AP: రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, అనకాపల్లి, పల్నాడు (వినుకొండ) జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, అల్లూరి, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Similar News
News September 21, 2025
BREAKING: టాస్ గెలిచిన భారత్

ASIA CUP: సూపర్-4లో భాగంగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బుమ్రా, వరుణ్ రీఎంట్రీ ఇచ్చారు.
భారత్: అభిషేక్, గిల్, సూర్య కుమార్(C), తిలక్, శాంసన్, దూబే, హార్దిక్, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాక్: ఫర్హాన్, అయుబ్, మహ్మద్ హారిస్, జమాన్, సల్మాన్(C), హుస్సేన్, మహ్మద్ నవాజ్, అష్రఫ్, షాహిన్ అఫ్రిదీ, అబ్రార్ అహ్మద్, హారిస్ రవూఫ్
News September 21, 2025
కాసేపట్లో వర్షం

TG: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, అబిడ్స్, సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరి ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది?
News September 21, 2025
సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి మృతి

TG: అధికారుల కళ్లుగప్పి 9 మంది యువకులు అనుమతి లేని జలపాతం వద్దకు వెళ్లగా, వారిలో ఒకరు మృతిచెందిన ఘటన ములుగు(D)లో జరిగింది. HYDలోని ఉప్పల్కు చెందిన మహాశ్విన్ 8మంది స్నేహితులతో కలిసి వాజేడు(M) కొంగాల జలపాతానికి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు జలపాతం గట్టుమీద కూర్చొని కాలుజారి నీటిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.