News September 21, 2025

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 190 పోస్టులు

image

<>పంజాబ్ <<>>& సింధ్ బ్యాంక్‌ 190 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు OCT 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్), CA/CMA, CFMA/MBA(ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Similar News

News September 21, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. దీని ప్రభావంతో.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇవాళ రాత్రి 7గంటల వరకు ప్రకాశం(D) సింగరాయకొండలో 69.5MM, చిత్తూరు(D) యడమర్రిలో 61MM వర్షపాతం నమోదైందని తెలిపింది.

News September 21, 2025

రేపు విశాఖకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. మరోవైపు రేపు మ.3గంటలకు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల ప్రదానం జరగనుంది. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నాయి.

News September 21, 2025

రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి

image

TG: రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని Dy.CM భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. మహిళలంతా ఆర్థికంగా, శక్తిమంతులుగా ఎదగాలి’ అని అన్నారు. అంతకుముందు కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ‌పై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు.