News September 21, 2025

పరకామణి కేసు లోక్ అదాలత్‌లో రాజీ కాదా…?

image

రవికుమార్ పరకామణిలో దొంగతనం చేసి 2023 ఏప్రిల్‌లో పట్టుబడ్డారు. ఆయనపై పోలీసులు సెక్షన్ 379, 381 కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌లో 379 దొంగతనం కేసు కాగా, సెక్షన్ 381‌లో యజమాని ఆస్తిని క్లర్క్, ఇతర ఉద్యోగులు దొంగిలించడం ద్రోహం అని చట్టం చెబుతోంది. ఇదే అంశాన్ని CRPC సెక్షన్ 320 క్లాస్ 2 అనుగుణంగా లోక్ అదాలత్‌లో రాజీ చేసుకునే వీలు లేదని చట్టాలు చెప్తున్నాయి. ఈ కేసు విషయం CBCID దర్యాప్తులో తేలనుంది.

Similar News

News September 21, 2025

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బీచ్ ఫెస్టివల్ ప్రచారం: కలెక్టర్

image

బాపట్ల కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ సూర్యలంక బీచ్ ఫెస్టివల్, ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రచారానికి ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల, చీరాల, ఇంకోల్లు, గుంటూరు ప్రాంతాల నుంచి 35కి పైగా ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. వారు ఏపీ టూరిజం సహకారంతో తీరప్రాంత సౌందర్యం, సాంస్కృతిక వైభవాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రోత్సహించేందుకు అంగీకరించారు.

News September 21, 2025

అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలి: కలెక్టర్

image

ఈ నెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటకల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

News September 21, 2025

జీవీఎంసీలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

image

జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రేపు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు ఈ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడును ఆ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.