News September 21, 2025
HYD: ‘కమీషన్ల కోసం దొంగ టిక్కెట్లు..!’

గ్రేటర్ HYD వ్యాప్తంగా రోజుకు 26 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మహాలక్ష్మి ప్రయాణాలు 72% ఉన్నట్లు తెలిపారు. అనేక డిపోలకు టార్గెట్లు నిర్ణయించగా కొంత మంది కండక్టర్లు కమీషన్ల కోసం దొంగ టికెట్లు కొడుతున్నట్లు గుర్తించి పలుచోట్ల హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు.
Similar News
News September 22, 2025
HYD: కోహెడ జలపాతంలో పడిపోయిన ఇంటర్ విద్యార్థి

HYD అబ్దుల్లాపూర్మెట్ PS పరిధి కోహెడ జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. బేగంపేట రసూల్పూర్కు చెందిన క్యామా సాయితేజ(17), అతడి ఏడుగురు స్నేహితులు సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్ కలిసి సా.4 గంటల ప్రాంతంలో ORR సర్వీస్ రోడ్డు పక్కనున్న కోహెడ జలపాతం వద్దకెళ్లారు. ఫొటోలు తీస్తుండగా సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, DRF బృందం వెతుకుతున్నారు.
News September 22, 2025
BREAKING: మల్కాజిగిరిలో పండుగ పూట దారుణం

HYD మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ PS పరిధి సాయి నగర్లో పండుగ పూట దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సాయినగర్లో ఉండే శ్రీనివాస్ కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. నెల క్రితం ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత తల్లిదండ్రులు అతడిని ఇంటికి తీసుకొచ్చారు. ఈక్రమంలో ఈరోజు అతడు కోపంతో తల్లిదండ్రులను దారుణం చంపాడు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు.
News September 21, 2025
HYD: విద్యార్థికి అన్ని విధాలా అండగా ఉంటాం: ఢిల్లీ పబ్లిక్ స్కూల్

గత నెల 29వ తేదీన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఘటనకు తాము చింతిస్తున్నామని యాజమాన్యం ఈరోజు ఓ ప్రెస్నోట్ రిలీజ్ చేసింది. విద్యార్థుల పరిరక్షణకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పింది. విద్యార్థికి గాయాలైన వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పేర్కొంది. విద్యార్థి కోలుకున్న తర్వాత చదువు విషయంలో ఇబ్బంది కలగకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.