News September 21, 2025

విజయవాడ: జగజ్జననీకి సమర్పించే నైవేద్యం ఇదే

image

కనకదుర్గమ్మవారికి వేకువజాము సుప్రభాతం, పూజాదికాలు, సాంబ్రాణి అనంతరం బాలభోగం కింద దద్ధోజనం సమర్పిస్తారు. తర్వాత ఉదయం 10కి రవ్వకేసరి, పులిహోర, దద్ధోజనం, కట్టెపొంగలి, లడ్డు బూంది, చక్రపొంగలితో రాజభోగం, 12కి గారెలతో పంచభోగాలను నివేదిస్తారు. సాయంత్రం 4కి శనగలు, స్వీట్, హాట్..6 గంటలకు మహానివేదనలో కదంబవంటకం, కూరలు, స్వీట్, హాట్ తదితర పదార్థాలు అమ్మవారికి సమర్పిస్తామని అర్చకులు వెల్లడించారు.

Similar News

News September 22, 2025

నిర్మల్: రేపటి ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు (సెప్టెంబర్ 22, సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం, వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ప్రజావాణిని తిరిగి నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర సమస్యలు ఉన్నవారు నేరుగా సంబంధిత శాఖాధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.

News September 22, 2025

రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్న సీఎం!

image

TG: సింగరేణి ఉద్యోగులకు CM రేవంత్ రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్నట్లు సమాచారం. శాశ్వత ఉద్యోగులకు రూ. 1.90 లక్షలు, తాత్కాలిక ఉద్యోగులకు రూ. 5వేల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. అలాగే సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా బొగ్గు అమ్మకాలు, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది.

News September 22, 2025

HYD: కోహెడ జలపాతంలో పడిపోయిన ఇంటర్ విద్యార్థి

image

HYD అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధి కోహెడ జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. బేగంపేట రసూల్‌పూర్‌కు చెందిన క్యామా సాయితేజ(17), అతడి ఏడుగురు స్నేహితులు సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్ కలిసి సా.4 గంటల ప్రాంతంలో ORR సర్వీస్ రోడ్డు పక్కనున్న కోహెడ జలపాతం వద్దకెళ్లారు. ఫొటోలు తీస్తుండగా సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, DRF బృందం వెతుకుతున్నారు.