News September 21, 2025

జగిత్యాల: రేపటి ప్రజా వాణి రద్దు

image

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం (రేపు)నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ B. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమావేశం ఏర్పాటు చేసినందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

Similar News

News September 22, 2025

రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్న సీఎం!

image

TG: సింగరేణి ఉద్యోగులకు CM రేవంత్ రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్నట్లు సమాచారం. శాశ్వత ఉద్యోగులకు రూ. 1.90 లక్షలు, తాత్కాలిక ఉద్యోగులకు రూ. 5వేల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. అలాగే సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా బొగ్గు అమ్మకాలు, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది.

News September 22, 2025

HYD: కోహెడ జలపాతంలో పడిపోయిన ఇంటర్ విద్యార్థి

image

HYD అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధి కోహెడ జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. బేగంపేట రసూల్‌పూర్‌కు చెందిన క్యామా సాయితేజ(17), అతడి ఏడుగురు స్నేహితులు సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్ కలిసి సా.4 గంటల ప్రాంతంలో ORR సర్వీస్ రోడ్డు పక్కనున్న కోహెడ జలపాతం వద్దకెళ్లారు. ఫొటోలు తీస్తుండగా సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, DRF బృందం వెతుకుతున్నారు.

News September 22, 2025

HYD: కోహెడ జలపాతంలో పడిపోయిన ఇంటర్ విద్యార్థి

image

HYD అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధి కోహెడ జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. బేగంపేట రసూల్‌పూర్‌కు చెందిన క్యామా సాయితేజ(17), అతడి ఏడుగురు స్నేహితులు సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్ కలిసి సా.4 గంటల ప్రాంతంలో ORR సర్వీస్ రోడ్డు పక్కనున్న కోహెడ జలపాతం వద్దకెళ్లారు. ఫొటోలు తీస్తుండగా సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, DRF బృందం వెతుకుతున్నారు.