News September 21, 2025
వారపు సంతల్లో వైద్య శిబిరాలు నిర్వహించండి: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలోని మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు గిరిజన వారపు సంతల్లో శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. సంతలకు వచ్చే ప్రజల ఆరోగ్య అవసరాల మేరకు రక్త పరీక్షలను నిర్వహించాలని అన్నారు. రక్త పరీక్షల్లో వ్యాధులు నిర్ధారణ అయితే వారికి ఉచిత వైద్యంతో పాటు మందులను సరఫరా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు.
Similar News
News September 22, 2025
‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.
News September 22, 2025
కాళోజీ కళాక్షేత్రంలో చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నాటకం.!

హనుమకొండ జిల్లాలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నృత్య రూపం అలరించింది. అకాడమీ ఛైర్ పర్సన్ పుంజాల అలేఖ్య పోషించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పాత్ర అద్భుతం. ఆనాటి నియంతృత్వ, దోపిడీ, పెత్తందారుల ఆగడాలను కళాబృందం ఎంతో కళ్లకు కట్టినట్టు ప్రదర్శించిన తీరు అభినందనీయం. నృత్య రూపకం ప్రదర్శించిన కళాకారులను అభినందించారు.
News September 22, 2025
యాదాద్రిపై రేపటి నుంచి శరన్నవరాత్రోత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధినీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అర్చనలు, లక్ష కుంకుమార్చనలు, చండీ హోమం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.