News September 21, 2025

ALP: జోగుళాంబకు గద్వాల సంస్థానాధీశుల కానుకలు

image

అలంపూర్‌లో వెలసిన జోగులాంబ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గద్వాల సంస్థానం వంశస్థులు కానుకలు అందజేశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించేందుకు 9 చీరలను బహుకరించారు. సంస్థానాధీశులు అమ్మవారికి చీరలు అందజేయడం పట్ల నడిగడ్డ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈవో దీప్తి చీరలు, సారె కానుకలను స్వీకరించినట్లు తెలిపారు.

Similar News

News September 22, 2025

FLASH: HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద

image

హయత్‌నగర్‌లో HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సమీప రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు మరోసారి ఇబ్బందులు తప్పడం లేదు. అటు దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు బయలు దేరిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News September 22, 2025

FLASH: HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద

image

హయత్‌నగర్‌లో HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సమీప రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు మరోసారి ఇబ్బందులు తప్పడం లేదు. అటు దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు బయలు దేరిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News September 22, 2025

‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

image

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.