News September 21, 2025
బ్రహ్మోత్సవాల సమయంలో వివాదాలు అవసరమా..?

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తిరుమల వైపు చూస్తారు. టీటీడీ టార్గెట్గా సాగుతున్న వివాదం కారణంగా భక్తులు బ్రహ్మోత్సవాల హడావిడిపై కాకుండా వివాదంపై దృష్టి మళ్లుతుంది. తిరుమల పవిత్రత దృష్ట్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగేలా దృష్టి సారించాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
Similar News
News September 22, 2025
సెప్టెంబర్ 22: చరిత్రలో ఈరోజు

1936: దర్శకుడు విజయ బాపినీడు జననం
1948: రంగస్థల నటుడు, దర్శకుడు మల్లాది గోపాలకృష్ణ జననం
1952: రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు మరణం
1987: సినీ నటుడు ఉన్నిముకుందన్ జననం(ఫొటోలో)
2004: సంగీత దర్శకుడు బి.గోపాలం మరణం
2009: నటి, గాయని ఎస్.వరలక్ష్మి మరణం
➤క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం
News September 22, 2025
వరంగల్: భారీ క్యూ లైన్.. ఎందుకో తెలుసా..?

WGL జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పై ఫొటోలో కనిపిస్తున్న భారీ క్యూ లైన్ ఎందుకో గెస్ చేయండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా యూరియా క్యూలైన్లు మనకు కనిపిస్తున్నాయి. అలా, ఇది కూడా యూరియా కోసమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పితృ అమావాస్య సందర్భంగా పెద్దలకు బియ్యం ఇవ్వడం మన సాంప్రదాయం. దీనిలో భాగంగా రాయపర్తి అర్చకుడు ఆరుట్ల రామకృష్ణ చార్యులు ఇంటి ముందు తమ పూర్వీకులకు బియ్యం ఇచ్చేందుకు ఇలా క్యూ కట్టారు.
News September 22, 2025
మహిళలతో కిక్కిరిసిన వేయి స్తంభాల గుడి

సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహిళలలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించి పేర్చిన బతుకమ్మలతో మహిళలందరూ భారీగా వేయి స్తంభాల గుడికి చేరుకొని సందడి చేశారు. చిన్నారులు, మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి డీజే పాటలకు అనుగుణంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండగ శోభను మరింత పెంచారు. మహిళలతో గుడి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.