News September 21, 2025
అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలి: కలెక్టర్

ఈ నెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటకల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
Similar News
News September 22, 2025
దసరా సెలవుల్లో ఊరేళ్లే వారికి సిరిసిల్ల ఎస్పీ సూచనలు

దసరా సెలవుల సందర్భంగా దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రజలను సూచించారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఇంటికి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News September 22, 2025
పవన్ అభిమానులకు ఇంకా నిరీక్షణే..

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘OG’ ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్ననే ట్రైలర్ రావాల్సి ఉండగా పలు కారణాలతో రిలీజ్ కాలేదు. అయితే సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా ట్రైలర్ రాకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ట్రైలర్ ఛాన్స్ ఉండటంతో రెండు రోజులు ముందు విడుదల చేస్తే ఎలా అని అంటున్నారు. ఇలాంటివి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని దర్శకనిర్మాతలకు సూచిస్తున్నారు.
News September 22, 2025
వరంగల్: బతుకమ్మను బతకనివ్వండి..!

బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామని లాస్యప్రియ అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజున HNK నయీం నగర్ ప్రాంతానికి చెందిన లాస్య సాయి ప్రకాశ్ ఆడ పిల్లల్ని కడుపులో ఉండగానే చంపుతున్నరాని, అలా చంపడం నేరమని., వాటిని నిర్మూలించాలని కోరుతూ ప్లే కార్డ్ పట్టుకొని బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామనే సందేశాన్ని అందించారు. వినూత్నంగా ఆలోచానను అందరు అభినందించారు.