News September 22, 2025

యధావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించారు.

Similar News

News September 28, 2025

రాజమండ్రి: రేబిస్‌ను నిర్లక్ష్యం చేయొద్దు: డీఎంహెచ్‌వో

image

రేబిస్ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణాంతకమవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. రాజమండ్రిలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. జిల్లాలో కుక్కల కాటు కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కుక్క కరిచిన వెంటనే వైద్య సాయం తీసుకోకపోతే రేబిస్ ముప్పు ఎక్కువవుతుందని, వెంటనే టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు.

News September 28, 2025

కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: తలారి

image

కొవ్వూరు మండలం కాపవరం పంచాయతీ గోవర్ధనగిరి మెట్టలో ఆదివారం ‘బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు వాటిని అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తుందని ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.

News September 28, 2025

గుర్రం జాషువాకు మంత్రి కందుల నివాళి

image

సమసమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత మహాకవి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేశ్ హాజరై, జాషువా చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తెలుగు సాహితీ లోకంలో ఆయన చిరస్మరణీయుడని మంత్రి దుర్గేశ్ కొనియాడారు.