News September 22, 2025

RDT సేవలు కొనసాగుతాయి: మంత్రి లోకేశ్

image

అనంతపురం జిల్లాలో RDT అంటే స్వచ్ఛంద సంస్థలు కాదని లక్షల మంది పేదల జీవితాలను మార్చిందని రాష్ట్ర ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచు ఫెర్రర్ అన్నారు. శనివారం అమరావతిలోని సచివాలయంలో మంత్రి నారా లోకేశ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్‌ను ఫెర్రర్ కోరారు. కాగా RDT సేవలపై లోకేశ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Similar News

News September 28, 2025

ధన్, ధాన్య కృషి యోజనలో అనంతపురం జిల్లా ఎంపిక

image

PM ధన్, ధాన్య కృషి యోజన కింద దేశంలోని 100 ఆశావహ వ్యవసాయ జిల్లాల్లో అనంతపురం ఎంపికైనట్లు MP అంబికా లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. PM మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌, CM చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు పంట ఉత్పాదకత తక్కువగా ఉండడం, తక్షణ రుణాల పంపిణీ పరిమితంగా ఉండడం వంటివి ఆధారంగా తీసుకున్న నిర్ణయం మంచిపరిణామమన్నారు.

News September 28, 2025

అనంతపురం జిల్లాలో పింఛన్లకు రూ.124.77 కోట్లు మంజూరు

image

అక్టోబర్ 1న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 2,79,933 మంది లబ్ధిదారులకు రూ.124.7 కోట్లు మంజూరు చేశారు. సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటలకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సొమ్ము అందజేయనున్నారు. అక్టోబర్ 2 సెలవు కారణంగా మొదటి రోజు పొందని వారు అక్టోబర్ 3న సచివాలయాలలో పెన్షన్ తీసుకోవచ్చని DRDA పీడీ శైలజ తెలిపారు.

News September 28, 2025

‘తాడిపత్రిలో 23 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

image

తాడిపత్రిలో ఆ మిత్రులందరూ 23 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్నారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి డాక్టర్లు, జడ్జి, టీచర్స్, ASPలుగా ఉన్నత పదవుల్లో ఉన్నారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత తమ గురువులతో కలిసి మిత్రులతో సంతోషంగా గడపడం ఎంతో సంతోషంగా ఉందని కరస్పాండెంట్ సిస్టర్ సెలీన్ పేర్కొన్నారు.