News September 22, 2025

13,217 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

image

దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును IBPS ఈ నెల 28 వరకు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. CBT, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ద్వారా ఎంపిక ఉంటుంది. కనీసం డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఏపీ గ్రామీణ బ్యాంక్‌లో 152, తెలంగాణ గ్రామీణ్ బ్యాంక్‌లో 798 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News September 22, 2025

అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. NDAలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు BJP మద్దతు ఇస్తోంది. ఇప్పటికే నిధుల కేటాయింపులోనూ కేంద్రం బిహార్‌కు పెద్దపీట వేస్తోంది. అటు INC నేత రాహుల్ గాంధీ SIRకు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

News September 22, 2025

నవరాత్రి ఉత్సవాలు షురూ..

image

దేశవ్యాప్తంగా దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడలో తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి నుంచి ఉ.4 గంటలకే అనుమతిస్తారు. అటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు.

News September 22, 2025

ఎల్లుండి విజయవాడకు సీపీ రాధాకృష్ణన్

image

AP: నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం పున్నమిఘాట్‌లో జరిగే ‘విజయవాడ ఉత్సవ్’లో పాల్గొంటారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం తెలిపింది. ఇటీవల సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన ఎంపీ, విజయవాడ ఉత్సవ్‌కు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ మేరకు ఆయన విచ్చేయనున్నారు.