News September 22, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News September 22, 2025

‘SIR’ అమలుకు ఈసీ ఆదేశాలు

image

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను అమలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈనెల 30లోపు గతంలో ప్రచురించిన ఓటరు జాబితాలతో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సీఈవోలకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రక్రియను అక్టోబర్-నవంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో SIR అమలు చేయగా, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.

News September 22, 2025

అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. NDAలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు BJP మద్దతు ఇస్తోంది. ఇప్పటికే నిధుల కేటాయింపులోనూ కేంద్రం బిహార్‌కు పెద్దపీట వేస్తోంది. అటు INC నేత రాహుల్ గాంధీ SIRకు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

News September 22, 2025

నవరాత్రి ఉత్సవాలు షురూ..

image

దేశవ్యాప్తంగా దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడలో తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి నుంచి ఉ.4 గంటలకే అనుమతిస్తారు. అటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు.