News September 22, 2025

వచ్చే నెలలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు

image

TG: సర్కారు జూనియర్ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో వీటిని కళాశాలలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రతీ కాలేజీకి ఫ్రీ ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా జేఈఈ, నీట్, ఎప్ సెట్ తదితర ప్రవేశపరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

Similar News

News September 22, 2025

KBCలో రూ.50లక్షలు గెలుచుకున్న కార్పెంటర్

image

అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో ఓ సామాన్యుడు కోటీశ్వరుడు కాకపోయినా లక్షాధికారి అయ్యాడు. పంజాబ్‌లోని హుస్సేన్‌పూర్‌కు చెందిన చందర్‌పాల్ కార్పెంటర్ వర్కర్. పెద్దగా చదువుకోకపోయినా వివిధ అంశాలపై జ్ఞానం పొంది, కేబీసీలో పాల్గొన్నాడు. అమితాబ్ అడిగిన రూ.50 లక్షల ప్రశ్నకు ఆడియన్స్ పోల్, 50-50 ఆప్షన్లు వాడుకొని సరైన సమాధానం చెప్పాడు. పిల్లల చదువుకు, వ్యాపార విస్తరణకు డబ్బును ఉపయోగిస్తానన్నాడు.

News September 22, 2025

‘SIR’ అమలుకు ఈసీ ఆదేశాలు

image

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను అమలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈనెల 30లోపు గతంలో ప్రచురించిన ఓటరు జాబితాలతో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సీఈవోలకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రక్రియను అక్టోబర్-నవంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో SIR అమలు చేయగా, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.

News September 22, 2025

అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. NDAలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు BJP మద్దతు ఇస్తోంది. ఇప్పటికే నిధుల కేటాయింపులోనూ కేంద్రం బిహార్‌కు పెద్దపీట వేస్తోంది. అటు INC నేత రాహుల్ గాంధీ SIRకు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.