News September 22, 2025
ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారిని వాళ్లే హత్య చేశారా?

పోరుమామిళ్ల(M) రెడ్డికోటకు చెందిన వేణుగోపాల్ రెడ్డి(54) వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రొద్దుటూరులోని బొల్లవరంలో సెటిల్ అయ్యారు. ఈనెల 19న బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఇంటికి కాస్త దూరంలో ఆయన బైక్ పడిపోవడం, దాని చుట్టూ కారం చల్లి ఉండటాన్ని వాచ్మెన్ గుర్తించాడు. కుందూ నదిలో ఆదివారం ఆయన <<17784556>>డెడ్బాడీ <<>>దొరికింది. తన దగ్గర అప్పులు తీసుకున్న వారిపై ఆయన కోర్టుకు వెళ్లడంతో వాళ్లే హత్య చేసి ఉంటారని సమాచారం.
Similar News
News September 28, 2025
కడప: జియాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంచాలకులు లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ కోర్సులో పట్టభద్రులైన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఇందుకు అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు విశ్వవిద్యాలయానికి వచ్చి సంప్రదించాలన్నారు.
News September 28, 2025
సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్తో ఎస్పీ నచికేత్ సమావేశం

కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శనివారం 50 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్తో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇన్ఫ్లూయర్స్ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రీల్స్, పోస్టులు, కథనాలు సమాజ హితానికి ఉపయోగపడేలా రూపొందించాలి, హింస, కుల, మత వివేధాలను కలిగించే పోస్టులలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News September 27, 2025
సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్తో ఎస్పీ నచికేత్ సమావేశం

కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శనివారం 50 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్తో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇన్ఫ్లూయర్స్ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రీల్స్, పోస్టులు, కథనాలు సమాజ హితానికి ఉపయోగపడేలా రూపొందించాలి, హింస, కుల, మత వివేధాలను కలిగించే పోస్టులలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.