News September 22, 2025
జన్నారం: 26 మంది అరెస్ట్.. కారణమిదే!

జన్నారంలో నిన్న <<17780717>>26 మంది<<>> ఆదివాసీలను అరెస్ట్ చేశారు. ASF జిల్లా లింగాపూర్, సిర్పూర్ (U), జైనూర్కు చెందిన గిరిజనులు కవ్వాల్లోని పాలగోరి భూములు తమ పూర్వీకులవేనని ఆక్రమించుకున్నారు. అక్కడే గుడిసెలు వేసుకొని 280 టేకు చెట్లు నరికివేశారని, అటవీ సిబ్బందిపై కారం చల్లి పలుమార్లు దాడి చేశారని FDO వెల్లడించారు. 1940 నుంచి ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అధికారులు రికార్డులు చూపుతున్నారు.
Similar News
News September 22, 2025
వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు లక్షణాలు

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు పంట నాటిన 25 నుంచి 35 రోజుల తర్వాత ఎప్పుడైనా ఆశించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గడం, ఆకులపై మంచు ఉండటం, అధిక వర్షం, అధిక నత్రజని వాడకం, మెగ్నీషియం లోపం ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతుంది. ఈ తెగులు వల్ల ఆకుల అడుగు భాగం, కాండం, ఊడలపైనా ముదురు రంగులో గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. తర్వాత దశలో ఈ మచ్చలు అన్నీ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు పండుబారి రాలిపోతాయి.
News September 22, 2025
బాలా త్రిపుర సుందరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రారంభించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థమై అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.
News September 22, 2025
RRRపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష

సచివాలయంలో RRRపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష నిర్వహించారు. RRR ఉత్తర భాగం టెండర్లు, దక్షిణ భాగం అలైన్మెంట్ ఆమోదం అంశాలపై రివ్యూ నిర్వహించారు. భూసేకరణ, పరిహారం, అలైన్మెంట్ మార్పులపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో ఆర్&బీ ఉన్నతాధికారులు, RRR ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.