News September 22, 2025

‘SIR’ అమలుకు ఈసీ ఆదేశాలు

image

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను అమలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈనెల 30లోపు గతంలో ప్రచురించిన ఓటరు జాబితాలతో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సీఈవోలకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రక్రియను అక్టోబర్-నవంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో SIR అమలు చేయగా, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.

Similar News

News September 22, 2025

యంత్ర ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>యంత్ర<<>> ఇండియా లిమిటెడ్(మహారాష్ట్ర) 2 సీనియర్, 3 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 4 లోపు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ICAI, ICMAI, HSSC, CA, CMA విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ఠ వయసు 40ఏళ్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ఠ వయసు 50ఏళ్లు. https://ddpdoo.gov.in/

News September 22, 2025

మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..

image

పసుపు రాసుకోవడానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యకారణాలున్నాయి. దీన్ని పూజల్లో, ఆహారంలో వాడటంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో కాళ్లకు, ముఖానికి రాసుకుంటారు. దీనివెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. పసుపు చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు గాయాలను మాన్పిస్తుంది. మహిళలు నీటిలో పనిచేయడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్లనొప్పులు, వాపులను పసుపు నిరోధిస్తుంది. అందుకే మహిళలు దీన్ని రాసుకుంటారు.

News September 22, 2025

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు లక్షణాలు

image

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు పంట నాటిన 25 నుంచి 35 రోజుల తర్వాత ఎప్పుడైనా ఆశించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గడం, ఆకులపై మంచు ఉండటం, అధిక వర్షం, అధిక నత్రజని వాడకం, మెగ్నీషియం లోపం ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతుంది. ఈ తెగులు వల్ల ఆకుల అడుగు భాగం, కాండం, ఊడలపైనా ముదురు రంగులో గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. తర్వాత దశలో ఈ మచ్చలు అన్నీ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు పండుబారి రాలిపోతాయి.