News September 22, 2025

కారణం లేకుండా మాపైకి రావడంతో దీటుగా బదులిచ్చా: అభిషేక్

image

ASIA CUP: నిన్నటి భారత్, పాక్ మ్యాచ్‌ సందర్భంగా అభిషేక్ శర్మ- రౌఫ్, అఫ్రీది మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. వీటిపై అభిషేక్ స్పందిస్తూ.. ‘కారణం లేకుండా పాక్ ప్లేయర్లు మాపైకి వచ్చారు. అది నాకు నచ్చలేదు. అందుకే వారికి దీటుగా బదులిచ్చా. జట్టు విజయం కోసం పోరాడా’ అని చెప్పారు. గిల్‌తో భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. ‘ఇద్దరం స్కూల్ డేస్ నుంచి కలిసి ఆడుతున్నాం. ఒకరి ఆటను మరొకరం గౌరవిస్తాం’ అని చెప్పారు.

Similar News

News September 22, 2025

దేశానికి సింగరేణి వెలుగులు అందిస్తోంది: CM

image

తెలంగాణ ఏర్పాటులో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ అన్నారు. ‘సింగరేణి బొగ్గు గనులు దేశానికి వెలుగులు అందిస్తున్నాయి. సంస్థకు వచ్చే లాభాలను కార్మికులకు పంచుతున్నాం. దేశంలోనే తొలిసారిగా ఒప్పంద కార్మికులకు కూడా గతేడాది రూ.5 వేల బోనస్ ఇచ్చాం. ఈసారి ఆ మొత్తాన్ని పెంచి రూ.5,500 ఇస్తున్నాం. ప్రైవేట్‌కు అప్పగించిన గనుల టెండర్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.

News September 22, 2025

ప్రభుత్వానికి సింగరేణి ఆత్మలాంటిది: భట్టి

image

TG: రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి ఆత్మలాంటిదని కార్మికులకు <<17791980>>బోనస్<<>> ప్రకటన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి నిర్ణయించినట్లు చెప్పారు. గత పదేళ్లుగా సంస్థ వేలంలో పాల్గొనకపోవడంతో రెండు బ్లాక్‌లను కోల్పోయిందన్నారు. దీంతో ఆ రెండు బ్లాక్‌లు అప్పటి ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు.

News September 22, 2025

సింగరేణి కార్మికులకు రూ.1,95,610 చొప్పున బోనస్

image

TG: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34శాతం పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా 41 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1,95,610 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు. 30 వేల మంది ఒప్పంద కార్మికులకు రూ.5,500 చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.