News September 22, 2025

VJA: ‘దసరా సెలవుల్లో స్కూల్ నిర్వహిస్తే కఠిన చర్యలు’

image

ప్రభుత్వం నేటి నుంచి దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో, పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్, పేరెంట్స్ మీటింగ్‌లు నిర్వహించరాదని DEO సుబ్బారావు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం DEO ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 22, 2025

అందంగా.. ఆపదలో రక్షణగా!

image

పనుల కోసం బయటికెళ్లే యువతులు, మహిళల స్వీయ రక్షణ కోసం కొత్త తరహా వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. క్యాట్ ఇయర్ కీచైన్లు లేదా కిట్టి నకిల్స్ లేదా సెల్ఫ్ డిఫెన్స్ కీ చైన్ల పేరుతో ఆన్‌లైన్‌లో లభిస్తాయి. అందంగా ఉండే వీటిని కార్, స్కూటీ కీలకు, బ్యాగ్‌లు, పర్సులకు పెట్టుకోవచ్చు. అత్యవసర సమయాల్లో వీటి రంధ్రాల్లో వేళ్లని పెట్టి గ్రిప్ తెచ్చుకుని అవతలి వ్యక్తిని ప్రతిఘటించవచ్చు.
#ShareIt

News September 22, 2025

‘విజయవాడ ఉత్సవ్‌’కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

image

AP: నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న విజయవాడ <<17789445>>ఉత్సవ్‌కు<<>> సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుర్గ గుడి భూముల్లో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. లీజ్‌కు తీసుకున్న వారికి, ఆలయానికి సమస్య లేనప్పుడు మూడో వ్యక్తికి అభ్యంతరమేంటని అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.

News September 22, 2025

మ‌హిళా సైంటిస్టులకు ఓ పథకం

image

ప్ర‌తిభావంతులైన మ‌హిళా శాస్త్ర‌వేత్త‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (WISE-KIRAN) ప‌థ‌కం అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా మూడేళ్లపాటు నెలకు రూ.50 వేల గౌర‌వవేత‌నం, HRA స‌దుపాయాలు క‌ల్పించి, వారి ప్రాజెక్టు కోసం రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక సహాయం అందజేస్తుంది. పీజీ పూర్తిచేసి, 27-60 ఏళ్లున్న మహిళలు అర్హులు. రెగ్యుల‌ర్ ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌లకు ఈ ప‌థ‌కం వర్తించదు.