News September 22, 2025
కనకదుర్గమ్మ చెంత 300 ఏళ్ల రావి చెట్టు

AP: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో 300 ఏళ్ల రావి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోజూ వేలాది మంది భక్తులు అమ్మవారితోపాటు ఈ వృక్షానికి దండం పెట్టుకుని వెళతారు. సాధారణంగా హిందువులు రావి చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వృక్షం దుర్గమ్మ చెంత ఉండటంతో విశిష్ఠత సంతరించుకుంది. కాగా ఇవాళ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు మొదలయ్యాయి.
Similar News
News September 22, 2025
₹500 కోట్లతో NTTPS కాలుష్య నివారణ పనులు

AP: NTTPS కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. పొల్యూషన్ రాకుండా ప్లాంటులో ₹500కోట్లతో పరికరాలు సమకూరుస్తున్నామన్నారు. ’పాండ్యాష్ నిల్వ, తరలింపుతోనే ఈ సమస్య. కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు, యాష్ రవాణాకు టెండరింగ్ ఏజెన్సీని నియమించాం. ఏజెన్సీ ఏర్పాటుపై అపోహలొద్దు.’ అని పేర్కొన్నారు. స్థానికుల ఉపాధి దృష్ట్యా ఉచితంగా బూడిద లోడింగ్, రవాణా ఖర్చులు అందిస్తున్నామన్నారు.
News September 22, 2025
రాష్ట్రంలో 42 పోస్టులు.. దరఖాస్తుల సవరణకు కొన్ని గంటలే ఛాన్స్

<
News September 22, 2025
భర్తలను కాపాడుకున్న భార్యలు!

భర్త ప్రాణాల్ని కాపాడుకొనేందుకు భార్య చూపే ప్రేమ, త్యాగాలకు సరిహద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నవీ ముంబైలో ప్రాణాంతక వ్యాధితో ఇద్దరు భర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ చేద్దామంటే కుటుంబీకుల రక్తం మ్యాచ్ అవ్వకపోవడంతో ఒకరి భర్త కోసం మరొకరు లివర్ను దానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్ విజయవంతమై నలుగురూ క్షేమంగా ఉన్నారు. భార్యల త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసింస్తున్నారు.