News September 22, 2025
HYD: డాగ్ అడాప్షన్కు ముందే వ్యాక్సినేషన్

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దేశీ పప్పీ డాగ్ అడాప్షన్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా KBR పార్కులో నిర్వహించిన రెండోసారి, 16 కుక్క పిల్లలను కుక్క పిల్లల ప్రేమికులకు అందజేసినట్లుగా తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందించే ఈ కుక్క పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడంతో పాటు, స్టెరిలైజేషన్ ముందే చేసి ఇస్తున్నట్లుగా వివరించారు.
Similar News
News September 22, 2025
రైల్నీర్ వాటర్ బాటిల్ @రూ.14

GST శ్లాబుల సవరణలతో ఇవాళ్టి నుంచి రైళ్లలో లభించే రైల్నీర్ వాటర్ బాటిల్ ధరను రైల్వే శాఖ తగ్గించింది. ఇప్పటివరకూ 1L బాటిల్పై రూ.15గా ఉన్న ధర రూ.14కు తగ్గింది. అలాగే గతంలో రూ.10గా ఉన్న 500 మి.లీ. బాటిల్ ₹9కే లభించనుంది. అయితే ఎక్కువ ధరలకు విక్రయిస్తే 139కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి రూపాయి ముఖ్యమే కాబట్టి తగ్గిన ధరలను గమనించి చిల్లరను అడిగి తీసుకోండి. SHARE IT
News September 22, 2025
NIRDPRలో ఉద్యోగాలు

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(<
News September 22, 2025
బాపట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బాపట్ల జిల్లాలో కురిసే భారీవర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ సోమవారం సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇది 24 గంటలు పనిచేస్తుందన్నారు. ఆపద సమయంలో కాల్ 97110 77372కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా అత్యవసర ఆపరేషన్ కేంద్రం 1077, రాష్ట్ర కేంద్రం 1070 టోల్ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచామన్నారు.