News September 22, 2025
రాష్ట్రంపై సైకోల కళ్లు పడకూడదని వేడుకున్నా: మంత్రి అనిత

AP: రాష్ట్రంపై సైకోల కళ్లు పడకూడదని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను వేడుకున్నట్లు హోంమంత్రి అనిత వివరించారు. బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. పాలనలో చంద్రబాబు, పవన్, లోకేశ్కు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం 20ఏళ్ల పాటు ఉండాలని వేడుకున్నానన్నారు. దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Similar News
News September 22, 2025
పలు జిల్లాలకు భారీ వర్షసూచన

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశముందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News September 22, 2025
నవ దుర్గల అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక

శ్రీశైలంలో భ్రమరాంబికా దేవీ నవరాత్రుల్లో(SEP 22-OCT 2) నవ దుర్గల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇవాళ దుర్గాదేవిగా అనుగ్రహించారు. రేపటి నుంచి వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అలంకారాల్లో దర్శనమిస్తారు. SEP 30న మహా అష్టమి సందర్భంగా భ్రమరాంబికా అమ్మవారి ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఈ అలంకారాలు శ్రీశైలంలో మాత్రమే దర్శించుకోవచ్చు.
News September 22, 2025
శ్రీశైలం: నవ దుర్గల అలంకారాలు.. విశిష్టత

1. శైలపుత్రి: సతీదేవి అగ్నిలో దూకి ఆహుతి చేసుకున్న తర్వాత హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా అవతరించారు. ఈమె త్రిశూలం, కమలంతో వృషభ వాహనంపై దర్శనమిస్తారు. శైలపుత్రి దర్శనం కల్యాణ యోగాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం.
2. బ్రహ్మచారిణి: పార్వతీదేవి జపమాల, కమండలం ధరించి శివుడి కోసం తపస్సు చేసిన రూపం బ్రహ్మచారిణి. ఈమె స్వరూపాన్ని దర్శించి, పూజిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.