News September 22, 2025

HYD: 24 నుంచి దుర్గామాత మండపాలకు ఫ్రీ కరెంట్

image

సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దుర్గామాత మండపాలకు ఉచిత కరెంటు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసేవారు స్థానిక PSలో సమాచారం అందజేసి, అనంతరం ఎలక్ట్రిసిటీ అధికారులకు సమాచారం ఇస్తే ఉచిత కరెంట్ అందేలా చర్యలు తీసుకుంటారని TGSPDCL AE నిఖిల్ తెలిపారు.

Similar News

News September 22, 2025

GST సంస్కరణలతో సామాన్యులకు మేలు: జగన్

image

AP: GST సంస్కరణల తుది ప్రయోజనాలు వినియోగదారులకు అందుతాయని ఆశిస్తున్నట్లు మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ఇది సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. సేవలు, వస్తువులను ప్రతి పౌరుడికి సరసమైన ధరల్లో అందించడంలో ఈ చర్యలు ఉపయోగపడతాయి. తొలుత కొన్ని ఫిర్యాదులు, ఇబ్బందులు ఉండొచ్చు. ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News September 22, 2025

అనకాపల్లిలో EVM గిడ్డంగులను తనిఖీ చేసిన కలెక్టర్

image

అనకాపల్లి SP కార్యాలయం వద్ద ఉన్న EVM గిడ్డంగులను కలెక్టర్ విజయకృష్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం తనిఖీ చేశారు. CC కెమెరాల పనితీరును పరిశీలించారు. ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లాక్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై రాజకీయ నాయకుల ప్రతినిధులతో చర్చించారు. ఈ తనిఖీల్లో RDO షేక్ ఆయిషా పాల్గొన్నారు.

News September 22, 2025

NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 89 ఫిర్యాదులు

image

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 89 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తో పాటు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.