News September 22, 2025

KNR: అమ్మవారి దీక్ష తీసుకున్న కేంద్రమంత్రి బండి

image

దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా KNR శ్రీ మహాశక్తి దేవాలయంలో KNR MP, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం అమ్మవారి దీక్షను స్వీకరించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఆయన మాలధారణ చేశారు. కాగా, దీక్ష స్వీకరించిన రోజునుంచి నవరాత్రులు ముగిసే వరకు ఆయన మహాశక్తి ఆలయంలోనే ఉంటారు. ఇక్కడ నిత్యం జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ దుర్గమ్మ సేవలో తరిస్తారు. ఈ 9 రోజులపాటు ఏ రాజకీయ కార్యక్రమాల్లో MP పాల్గొనరు.

Similar News

News September 22, 2025

భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: CM

image

జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ స్నేహ శబరీశ్, డీఎఫ్‌వో లావణ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News September 22, 2025

స్వచ్ఛమైన ప్రకృతి వనరులను అందించాలి: పవన్

image

AP: పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకెళ్లాలని Dy.CM పవన్ పేర్కొన్నారు. అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శితో ఆయన భేటీ అయ్యారు. ‘కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలి. మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు అర్థమయ్యేలా సమగ్ర నివేదిక సిద్ధం చేయండి. సాధ్యమైనంత స్వచ్ఛంగా ప్రకృతి వనరులను భావి తరాలకు అందించే లక్ష్యంతో పని చేయాలి’ అని దిశానిర్దేశం చేశారు.

News September 22, 2025

అర్జీదారులతో కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న అర్జీదారులతో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి కలిసి భోజనం చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల కోసం కాశిరెడ్డి నాయన సత్రం, ఓంకారం వారి ఆధ్వర్యంలో అందజేసే ఉచిత భోజన కార్యక్రమంలో అర్జీదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అర్జీదారులతో భోజనం చేస్తూ వారి సమస్యలను నేరుగా విన్నారు.