News September 22, 2025
VJA: దసరా ఉత్సవ సేవా కమిటీ ఏర్పాటు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందర్బంగా భక్తులకు సేవలందించే సేవా కమిటీ సభ్యులను నియమించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మొత్తం 96 మందిని ఎంపిక చేశారు. వీరు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 02వ తేదీ వరకు అమ్మవారి ఆలయం వద్ద ఉండి భక్తులకు అవసరమైన సేవలను అందిస్తారని ఎండోమెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. ఈ మేరకు సేవా కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ఐడీ కార్డులను అందజేయనున్నారు.
Similar News
News September 22, 2025
HYD: 26 లక్షల మంది ప్రయాణికులు.. బస్సులు 3,200..!

HYD నుంచి వివిధ జిల్లాలు, పట్టణాలకు ఆర్టీసీ కేవలం 3,200 బస్సులు మాత్రమే నడిపిస్తుండడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. 26 లక్షల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా సరిపడా బస్సులు లేకపోవడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
News September 22, 2025
HYD: 26 లక్షల మంది ప్రయాణికులు.. బస్సులు 3,200..!

HYD నుంచి వివిధ జిల్లాలు, పట్టణాలకు ఆర్టీసీ కేవలం 3,200 బస్సులు మాత్రమే నడిపిస్తుండడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. 26 లక్షల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా సరిపడా బస్సులు లేకపోవడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
News September 22, 2025
వరంగల్: నిన్న అలా.. నేడు ఇలా..!

బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఉన్న క్రేజ్ మిగతా రోజులకు ఉండట్లేదు. తొమ్మిది రోజులు జరుపుకునే ఘనమైన పండుగ బతుకమ్మ. కానీ, నేటి మహిళలు కేవలం మొదటి, చివరి రోజులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజు దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలతో కిటకిటలాడగా, రెండవ రోజు అసలు బతుకమ్మ ఊసే లేకుండా పోయింది. వరంగల్ జిల్లా మొత్తం పరిస్థితి నెలకొంది.