News September 22, 2025
నవరాత్రి ఉత్సవాలు.. ఉపవాసం ఉంటున్నారా?

నవరాత్రుల సందర్భంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా అలసిపోవడం, తల తిరగడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు తినడం, రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం, ఫైబర్, ప్రొటీన్, ఆహారంలో కార్బోహైడ్రేట్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవడం వంటి చిట్కాల ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.
Similar News
News September 22, 2025
పవన్ ‘OG’కి ‘A’ సర్టిఫికెట్.. 1AM షో క్యాన్సిల్

‘OG’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని అర్థం. మూవీలో విపరీతమైన వైలెన్స్ కారణంగానే A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైమ్ను 2.34 గంటలకు(154ని. 15 సెకన్లు) లాక్ చేశారు. అటు ఏపీలో 25న 1AM షోను క్యాన్సిల్ చేసి 24న రాత్రి 10 గం.ల ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
News September 22, 2025
పరకామణిపై CBI విచారణ చేయాలి: YCP

AP: తిరుమల <<17772428>>పరకామణి<<>> వివాదంపై CBI విచారణ, SC నేతృత్వంలో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని YCP డిమాండ్ చేసింది. CJI గవాయ్, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వైసీపీ MP గురుమూర్తి లేఖలు రాశారు. హుండీ సొమ్ము చోరీ జరిగిందన్న ఆరోపణల వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఉన్నాయన్నారు. సరైన ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే తిరుమలను పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అసహనం వ్యక్తం చేశారు.
News September 22, 2025
నక్సలైట్లపై మరో మేజర్ విక్టరీ: అమిత్షా

నక్సలైట్లపై భద్రతా బలగాలు మరో మేజర్ విక్టరీ సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్(D) అబూఝ్మాడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలను మట్టుబెట్టాయని ట్వీట్ చేశారు. బలగాలు ప్లాన్ ప్రకారం నక్సల్స్ టాప్ లీడర్స్ను అంతమొందిస్తున్నాయని అన్నారు. కాగా చనిపోయిన ఇద్దరిపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉంది.