News September 22, 2025
చిత్తూరు కలెక్టర్కు 348 అర్జీలు

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో జరిగిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 348 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు విభాగాలకు చెందిన సమస్యలను ఆయన స్వయంగా విని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
Similar News
News September 22, 2025
జిల్లా జడ్జిని కలిసిన SP తుషార్ డూడీ

చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడీ సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారికను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు బొకే అందజేశారు. అనంతరం జిల్లా న్యాయవ్యవస్థ, చట్ట అమలు వ్యవహారాలపై చర్చించారు. చిత్తూరులో శాంతి భద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేస్తామని ఎస్పీ తెలిపారు.
News September 22, 2025
చిత్తూరు: RTCలో అప్రెంటీస్ షిప్కు నోటిషికేషన్

APSRTC అప్రెంటీస్ షిప్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DPTO జగదీష్ తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలో డీజల్ మెకానిక్స్ 33, మోటర్ మెకానిక్స్ 2, ఎలక్ట్రీషియన్స్ 8, వెల్డర్ 1, ఫిట్టర్ 3 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా పరిధిలో ITI చదివిన వారు మాత్రమే అర్హులు. అక్టోబర్ 4వ తేదీ లోపు ఆర్టీసీ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
News September 22, 2025
పెద్ద పంజాని: బెట్టింగ్ యాప్ మోసగాడి అరెస్ట్

బెట్టింగ్ యాప్ మోసగాడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన చంద్రబాబు బెట్టింగ్ యాప్ ద్వారా ప్రజలను మోసం చేసేవాడు. ఈ నేపథ్యంలో రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వద్ద షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానని నమ్మించి రూ.2 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా అతడి బ్యాంకు అకౌంటుకు ఇతని మొబైల్ నెంబరును లింకు చేసుకుని దాదాపు రూ.కోటికి పైగా మోసం చేశాడు.