News September 22, 2025
పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి: MP కావ్య

వరంగల్లో గత 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్కటిగా పూర్తి అవుతున్నాయని MP కడియం కావ్య అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమ పథకాలను రెండు కళ్లుగా ముందుకు నడిపిస్తోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు కడుతూనే, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరంగా అమలు చేస్తోందని అన్నారు.
Similar News
News September 23, 2025
లోకేశ్ అన్న.. నువ్వు ఇచ్చిన బూట్లు ఏమయ్యాయి: అంబటి

AP: బడి పిల్లలకు చెప్పులు కొనిపెట్టిన పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ <<17786148>>వెంకటరత్నం<<>> వీడియోను మంత్రి లోకేశ్ SMలో షేర్ చేసిన విషయం తెలిసిందే. దానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘లోకేశ్ అన్న.. నువ్వు ఇచ్చిన బూట్లు ఏమయ్యాయి? క్వాలిటీలేక పోయాయా? అసలు ఇవ్వకుండా మింగేశావా? ఏది ఏమైనా వెంకటరత్నం గారికి హాట్సాఫ్’ అని ట్వీట్ చేశారు.
News September 23, 2025
సీఎం వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్

రహదారి నిర్మాణ పనుల్లో ఆలస్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యకు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసుల్లో ఉన్నచోట్ల ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు పాల్గొన్నారు.
News September 23, 2025
BREAKING.. కొత్తగూడెంలో వ్యక్తి దారుణ హత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య జరిగింది. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ప్రాంతంలో సింగరేణి విశ్రాంతి కార్మికుడు
మోహన్రావును గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.