News September 22, 2025
HYD: 26 లక్షల మంది ప్రయాణికులు.. బస్సులు 3,200..!

HYD నుంచి వివిధ జిల్లాలు, పట్టణాలకు ఆర్టీసీ కేవలం 3,200 బస్సులు మాత్రమే నడిపిస్తుండడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. 26 లక్షల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా సరిపడా బస్సులు లేకపోవడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Similar News
News September 23, 2025
హైదరాబాద్లో డ్రోన్ పోలీసింగ్కు సీఎం ఆదేశం

హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆదేశించారు. వెంటనే డ్రోన్లను కొనుగోలు చేయాలని పోలీస్ విభాగానికి సూచించారు. అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో వీటిని వాడాలని చెప్పారు. డ్రోన్ ద్వారానే వాహనదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 22, 2025
HYD: యువతిపై బ్లేడ్తో దాడి చేసింది ఇతడే..!

కూకట్పల్లి పరిధి <<17796420>>మూసాపేట్ మెట్రో స్టేషన్<<>> కింద యువతిపై యువకుడు బ్లేడ్తో దాడి చేసిన ఘటనలో నిందితుడు MDమొహ్సిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి మెట్రో స్టేషన్ వద్దకు యువతిని రమ్మని పిలిచి విచక్షణరహితంగా బ్లేడుతో దాడి చేశాడు. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.కేసు నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
News September 22, 2025
HYD: తల్లిదండ్రుల హత్య కేసులో నిందితుడికి రిమాండ్

మల్కాజిగిరిలోని <<17789520>>నేరేడ్మెట్ పోలీస్స్టేషన్<<>> పరిధి సాయినగర్లో నివసించే రాజయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీనివాస్ ఆదివారం మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడి, వారిని చంపిన విషయం తెలిసిందే. స్థానికులు శ్రీనివాస్ను చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది.