News April 5, 2024
రూ.2లక్షల రుణమాఫీ పొందినవాళ్లు కాంగ్రెస్కు ఓటేయండి: హరీశ్ రావు

TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు నమ్మి ఓట్లేసిన ప్రజలు మోసపోయారని మాజీ మంత్రి హరీశ్రావు చెప్పారు. 4 నెలల పాలనలోనే నానా తిప్పలు పడ్డారన్నారు. ‘రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఆ లబ్ధి పొందినవాళ్లు కాంగ్రెస్కు, లేదంటే BRSకు ఓటేయండి. వరి పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో చురక పెడితేనే పనులు జరుగుతాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
T20WC-2026 వేదికలు ఖరారు!

ICC మెన్స్ T20WC-2026 వేదికలు దాదాపు ఖరారయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, చెన్నైలో మ్యాచ్లు జరిగే అవకాశముంది. పాక్ మ్యాచ్లను కొలంబోలో నిర్వహిస్తారు. అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఫైనల్ నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. మొత్తం 20 టీమ్స్ 4 గ్రూపుల్లో ఆడతాయి. ప్రతి గ్రూపులోని టాప్-2 జట్లు సూపర్-8కి చేరతాయి. ఇక్కడ 2 గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడతాయి. ఇందులో టాప్-2 జట్లు సెమీస్కు వెళతాయి.
News November 6, 2025
పసుపులో ముర్రాకు తెగులు, దుంపకుళ్లు.. నివారణకు సూచనలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పసుపు పంటలో ముర్రాకు తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. అందుకే తెగులు ఆశించిన ఆకులను తుంచి కాల్చివేయాలి. థయోఫానైట్ మిథైల్ 2 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. అలాగే దుంపకుళ్లు నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్+మ్యాంకోజెబ్ 3గ్రా. చొప్పున కలిపి మొక్కల మొదళ్లను తడపాలి.
News November 6, 2025
డిజిలాకర్లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: సీఎం

AP: డేటా ఆధారిత పాలన ఎంతో కీలకమని CM చంద్రబాబు తెలిపారు. తుఫాను సమయంలో టెక్నాలజీ సాయంతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించామన్నారు. పాలనలో ఆధునిక టెక్నాలజీ, RTGSతో సమన్వయంపై అధికారులు, మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘అందుబాటులో ఉన్న డేటాను రియల్టైమ్లో ప్రాసెస్ చేస్తున్నాం. దీన్ని విస్తరించాలి. డిజిలాకర్లో విద్యార్థుల సర్టిఫికెట్లు, రోగుల హెల్త్ రికార్డులు అందుబాటులో ఉండాలి’ అని సూచించారు.


