News September 22, 2025

INDvsPAK: మరోసారి ICCకి PCB ఫిర్యాదు!

image

భారత్, పాక్ మ్యాచ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నిన్నటి మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌‌ను <<17794224>>ఔట్‌గా<<>> ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించినట్లు సమాచారం. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు పాక్ మీడియా పేర్కొంది. కాగా అంతకుముందు హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో రిఫరీ పైక్రాఫ్ట్‌పై PCB <<17717948>>ఫిర్యాదు<<>> చేసి భంగపడిన విషయం తెలిసిందే.

Similar News

News September 23, 2025

24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు తీసుకోలేదు: అమిత్ షా

image

గత 24 ఏళ్లలో మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్విరామమైన పని PM నిర్ణయాలపై, పనివేగంపై ప్రభావం చూపలేదన్నారు. కఠినమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో ఎలాంటి బాస్ కల్చర్ లేదన్నారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి స్వావలంబన భారత్ విజన్‌ను నిర్దేశించుకున్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆయన చెప్పారు.

News September 23, 2025

సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం(ఫొటో)
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం

News September 23, 2025

మరోసారి క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ సంఘం(CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన క్యాబ్ 94వ వార్షిక సదస్సుల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2015-19లో దాదా CAB అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈడెన్ గార్డెన్ సీట్ల సామర్థ్యం పెంపుపై ఆయన ఫోకస్ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా-టీమ్ ఇండియా తొలి టెస్టు ఈడెన్‌లోనే జరగనుంది. చివరగా 2019లో ఇక్కడ టెస్టు మ్యాచ్ జరిగింది.