News September 22, 2025
యువత అనవసరంగా తిరగడం మానేయాలి: ADB SP

నవరాత్రి ఉత్సవాల్లో మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించి సహాయాన్ని పొందవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రాత్రి సమయాల్లో యువత అనవసరంగా తిరగడం మానేయాలని సూచించారు. మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో యువత, తెలియని వారు వారిని వీడియోలు తీయడం, వికృత చేష్టలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News September 23, 2025
ADB: చేప.. చేప నువ్వేక్కడా?

తెలంగాణ మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఆ పథకం అమలుకాక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 283 చెరువులు ఉండగా.. 107 మత్స్యకార సంఘాలు పని చేస్తున్నాయి. వీటితో పాటు సాత్నాల, మత్తడివాగు, దహెగాం ప్రాజెక్టులు ఉన్నాయి. జలవనరుల్లో కోటి వరకు చేప పిల్లలు వదలాలి. సెప్టెంబర్ నెల గడిచిపోతున్నా చేప పిల్లు ఇంకా వదలలేదు.
News September 22, 2025
ADB: అగ్రి కళాశాల అసోసియేట్ డీన్గా డా.వై.ప్రవీణ్ కుమార్

వ్యవసాయ కళాశాల నూతన అసోసియేట్ డీన్గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు డీన్గా ఉన్న డాక్టర్ శ్రీధర్ చౌహాన్ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీపై వెళ్లారు. గతంలో ప్రవీణ్ కుమార్ కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్లో కోఆర్డినేటర్గా విధులు నిర్వహించారు. నూతనంగా విధులు స్వీకరించడం పట్ల కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.
News September 22, 2025
ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలి: ADB SP

ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎస్పీ అఖిల్ మహాజన్ ను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. మొత్తం 43 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.