News September 22, 2025

HYD: తల్లిదండ్రుల హత్య కేసులో నిందితుడికి రిమాండ్‌

image

మల్కాజిగిరిలోని <<17789520>>నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌<<>> పరిధి సాయినగర్‌లో నివసించే రాజయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీనివాస్‌ ఆదివారం మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడి, వారిని చంపిన విషయం తెలిసిందే. స్థానికులు శ్రీనివాస్‌ను చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి రిమాండ్‌ విధించింది.

Similar News

News September 23, 2025

జుబీన్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

image

అస్సాం ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్(52) మృతదేహానికి మరో సారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఎం హిమంత బిస్వశర్మ తెలిపారు. కొన్ని వర్గాలు ఆయన <<17783688>>మరణంపై<<>> అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగపూర్ వైద్యులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నాయని, సీఐడీకి కేసు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. కాగా ఇవాళ అధికార లాంఛనాలతో జుబీన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News September 23, 2025

దిలావర్పూర్: ఇక్కడ కోనేరులో బతుకమ్మల నిమజ్జనం

image

దిలావర్పూర్‌లో బతుకమ్మను నిమజ్జనం చేసే స్థలానికి ఓ ప్రత్యేకత దాగి ఉంది. పలుచోట్ల బతుకమ్మ నిమజ్జనాలు చెరువుల్లో, నదుల్లో వేస్తారు. కానీ ఇక్కడ చివరి రోజు అంగరంగ వైభవంగా కోలాలతో నృత్యాలు చేస్తూ రేణుక ఎల్లమ్మ కోనేరులో నిమజ్జనం చేస్తారు. ఈ కోనేరుకు చర్మ వ్యాధులను దూరం చేసే మహత్యం ఉందని విశిష్ట నమ్మకం. కోనేరులో బతుకమ్మలు వేయడం వల్ల మరింత శుద్ధి అవుతుందని నమ్మకం.

News September 23, 2025

హన్మకొండ: పచ్చదనం విరిసి.. అవని మురిసి..!

image

అందమైన ప్రకృతి అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. చుట్టూ పంట పొలాలు, వాటి మధ్యలో గుట్టలు, ఎత్తైన తాటి చెట్లు, పంట పొలాల్లో పని చేస్తున్న రైతన్నలు, గొర్రెలను మేపుతున్న కాపరులు. ఇవన్నీ ఒకే చోట ఉంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పవచ్చు. అలాంటి దృశ్యం మన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామ శివారులోని ఇనుపరాతి గుట్టల వద్ద కనివిందు చేస్తోంది. అచ్చం ఓ చిత్రకారుడు గీసిన చిత్రలాగే ఉంది.