News April 5, 2024

వెల్దుర్తి: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్ పర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంగలి భీమయ్య(46) తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. బంధువుల ఫిర్యాదులతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News March 2, 2026

MDK: ప్రశాంతంగా, కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండగ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటాల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని తెలిపారు.

News March 2, 2026

ఇంటర్మీడియట్ పరీక్షకు 95.55 శాతం హాజరు

image

జిల్లాలో ఐదవ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర బోటనీ I, పొలిటికల్ సైన్స్-1, మ్యాథ్స్ -1A పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. 95.55 శాతంగా జనరల్ విభాగంలో 6706 గాను 6401 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 612 గాను 592 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

News March 2, 2026

రాష్ట్రస్థాయి పోటీలకు కూచన్ పల్లి విద్యార్థిని

image

కూచన్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు ఎంపికైనట్లు MEO నాచారం మధుమోహన్ తెలిపారు. రెండు రోజుల క్రితం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కూచన్ పల్లి పాఠశాల నుంచి అభినయ, సాత్విక, సహస్రలు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.