News September 23, 2025
GWL: ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: ఎస్పీ

ప్రజల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో 16 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో భూ సమస్యలు 3, కుటుంబ తగాదాలు 4, గొడవలు 3, ప్లాటు, ప్రభుత్వ ఉద్యోగం, విదేశాలకు పంపే అంశాలపై ఒక్కో ఫిర్యాదు వచ్చాయన్నారు. ఇతర అంశాలపై 3 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 23, 2025
బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్గా విశాఖ: కాటమనేని

విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్లో వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, అదానీ, ఇన్ఫోసిస్, మౌరి టెక్ వంటి కంపెనీలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ITE&C కార్యదర్శి కటామనేని భాస్కర్ తెలిపారు. విశాఖను ‘బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కటంనేని స్పష్టం చేశారు.
News September 23, 2025
మరో 2 గంటల్లో వర్షం

తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న <<17794672>>హైదరాబాద్<<>> సహా పలు జిల్లాల్లో వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. మేడ్చల్, వరంగల్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, నిర్మల్, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News September 23, 2025
VJA: దుర్గమ్మ ప్రసాదం .. నేతి లడ్డూ తయారీ ఇలా.!

విజయవాడ దుర్గమ్మ నేతి లడ్డూ అంటే భక్తులకు అత్యంత ఇష్టం. ఈ ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో 36 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రసాదాల పోటు భవనంలో లడ్డూ తయారీని ఆరంభించారు. ఈసారి విశాలమైన నూతన భవనం ఆరంభించారు. ఎంతో శుభ్రత పాటిస్తూ.. స్వచ్ఛమైన.. రుచికరమైన ప్రసాదం తయారు చేస్తున్నారు.