News September 23, 2025
సరిపడా సత్రాలు లేక మేడారం జాతరలో ఇబ్బందే..!

కోటి మంది భక్తుల కొంగుబంగారం మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను CM రేవంత్ రెడ్డి నేరుగా మంగళవారం పరిశీలించనున్నారు. కాగా, సారలమ్మ వచ్చే ఒకరోజు ముందుగానే భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి చేరుకుంటారు. అయితే, అక్కడ సరైన సత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరిపడా సత్రాలు ఏర్పాటు చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
Similar News
News September 23, 2025
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ప్రకాశం ఎస్పీ

ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతిని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి మొక్కను ఎస్పీ అందజేశారు. అనంతరం బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీస్ శాఖ తరపున కృషి చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
News September 23, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 23, 2025
నర్సాపూర్: అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ మృతి

శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(40) అనే డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం నర్సాపూర్లో తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.