News September 23, 2025
ఖానాపూర్: గోదావరికి పోటెత్తిన వరద

ఎస్సారెస్పీకి వచ్చిన వరదను దిగువకు వదలడంతో ఖానాపూర్, కడెం, మామడ మండలాల పరిధిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఎస్సారెస్పీ 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు నదివైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Similar News
News September 23, 2025
కరీంనగర్: భూతల్లే వారికి డైనింగ్ టేబుల్..!

పొలం పనులకు వెళ్లిన మహిళా కూలీలకు పొలం పక్కన ఉన్న రోడ్డే డైనింగ్ టేబుల్ అయింది. ఉదయం నుంచి అలుపెరగకుండా శ్రమించిన వీరు.. మధ్యాహ్నం వేళ రోడ్డు పక్కనున్న చెట్టు కింద సేదతీరుతూ తెచ్చుకున్న సద్ది బువ్వను తిన్నారు. కష్టానికి అలసట తెలియదు, కన్నీళ్లకు బాధ ఉండదు అన్నట్లుగా తమ నిరాడంబరమైన జీవనశైలితో శ్రమజీవుల కష్టానికి నిలువుటద్దంలా నిలిచిన ఈ దృశ్యం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూర్లో కన్పించింది.
News September 23, 2025
డిగ్రీ కాలేజీల బంద్ కొనసాగుతుంది: ప్రైవేటు యాజమాన్యాల అసోసియేషన్

AP: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనందుకు నిరసనగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా 70% కాలేజీలు మూసివేసినట్లు ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 27వరకు కాలేజీల బంద్ కొనసాగుతుందని ప్రకటించింది. OCT 6నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని వెల్లడించింది. గత 16 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొంది.
News September 23, 2025
స్థానిక ఎన్నికలకు సిద్ధం: మంత్రి లోకేశ్

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై నిన్న మీడియా చిట్చాట్లో మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్స్కు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే అందుకు వచ్చే ఏడాది మార్చి వరకు గడువుందని గుర్తు చేశారు. అటు నిర్ణీత గడువులోపు స్థానిక ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుమల పరకామణిలో చోరీ కేసును సిట్తో దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ తెలిపారు.